మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత కొత్త పార్టీ ఏర్పాటును “బిగ్ జోక్”గా అభివర్ణించారు. “తండ్రికి (కేసీఆర్) కనీస విలువ ఇవ్వని మనిషి.. తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడి బిడ్డగా మాత్రమేనని, ఆమెకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. తిరిగి TRS పేరుతో పార్టీ పెట్టడం మరో పెద్ద జోక్ అని, కేసీఆర్ పేరు లేకుంటే కవితకు అడ్రస్ కూడా ఉండదని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కుటుంబం ఇప్పుడు కొత్త పార్టీలతో ప్రజలను మళ్ళీ మోసం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు.
Source link
Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










