Rajasthan Royals: చిక్కుల్లో రాజస్థాన్ రాయల్స్.. రూ. 15,660 కోట్ల డీల్‌పై రాజుకున్న నిప్పు | క్రీడా వార్తలు | ACTPnews

PC : IPL


Last Updated:

ఆదివారం నాడు లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, ఈ డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది.

PC : IPL
PC : IPL

Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన యాజమాన్య మార్పులలో ఒకటిగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) విక్రయం ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఆదివారం నాడు లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, ఈ డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది.

ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

న్యాయపోరాటానికి రంగం సిద్ధం

క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం, కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ (PR) బృందాలతో చర్చలు జరిపింది. “ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్‌తో మాట్లాడాము. నేడే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము” అని ఆ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.

ఒప్పందం ఎందుకు బెడిసికొట్టింది?

రాజస్థాన్ రాయల్స్ మరియు కల్ సోమని మధ్య కుదరాల్సిన డీల్ ఎందుకు ఆగిపోయింది అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చెల్లింపుల్లో జాప్యం: ఒక నెల రోజుల ప్రత్యేక ఒప్పంద సమయం (Exclusivity Period) ఉన్నప్పటికీ, సోమని బృందం సకాలంలో నిధులు చెల్లించలేదని ఒక వాదన వినిపిస్తోంది.

నిధుల కొరత లేదన్న సోమని: అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్ మరియు హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వక జాప్యం ఆరోపణలు

ఫ్రాంచైజీ వైపు నుంచే డాక్యుమెంటేషన్ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా జాప్యం జరిగిందని సోమని కన్సార్టియం ఆరోపిస్తోంది. “మేము గత 10 రోజులుగా డీల్ ముగించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ వారు కావాలనే కాలయాపన చేస్తూ, మరోవైపు ఇతర బృందాలతో రహస్యంగా చర్చలు జరిపారు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిసిసిఐకి చెల్లించాల్సిన బకాయిలు, ఫ్రాంచైజీపై ఉన్న న్యాయపరమైన కేసుల గురించి తాము అడిగిన వందలాది ప్రశ్నలకు సరైన సమాధానాలు రాలేదని వారు తెలిపారు.

మనోజ్ బదాలే పాత్రపై భేదాభిప్రాయాలు

మరో ప్రధాన వివాదాంశం ప్రస్తుతం ఉన్న లీడ్ ఓనర్ మనోజ్ బదాలే పాత్ర. సోమని నేతృత్వంలోని గ్రూప్ బదాలే కొనసాగింపును ఇష్టపడలేదు. కానీ, కొత్తగా వచ్చిన మిట్టల్-పూనావాలా కన్సార్టియం ఒప్పందంలో మనోజ్ బదాలే కీలక స్థానంలో కొనసాగుతున్నారు. ఇదే విషయం డీల్ చెడిపోవడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌తో పాటు దక్షిణాఫ్రికాలోని పార్ల్ రాయల్స్, కరేబియన్ లీగ్‌లోని బార్బడోస్ రాయల్స్ జట్లను కూడా కొత్త యజమానులు దక్కించుకున్నారు. అయితే సోమని గ్రూప్ కోర్టు మెట్లు ఎక్కితే ఈ మెగా డీల్ అమలయ్యే విషయంలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. ఐపీఎల్ వేలానికి ముందు ఈ పరిణామాలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports