Last Updated:
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను అత్యంత భారీ కాన్వాస్పై తెరకెక్కిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు బాలీవుడ్ దిగ్గజ సంస్థ టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన చేశారు.














