ముఖేశ్ అంబానీ కీలక ప్రసంగం..
గత ఆరు సంవత్సరాలు అనేక దశాబ్దాలతో పోలిస్తే అత్యంత అస్థిరత, అనిశ్చితితో కూడిన కాలంగా నిలిచాయి. కోవిడ్-19 మహమ్మారి, పెరిగిన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు, యుద్ధాలు, ఇంధన మార్కెట్లో అంతరాయాలు, సరఫరా గొలుసుల విభజన, ముడి సరుకుల ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, అలాగే మూలధన మార్కెట్ల మారుతున్న పరిస్థితులు కలిసి ప్రపంచ వ్యాపార వాతావరణాన్ని గతంతో పోలిస్తే మరింత అనూహ్యంగా మార్చాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ 49వ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో పేర్కొన్నారు.












