Last Updated:
ఉక్రెయిన్ నగరాలపై రష్యా మరోసారి భీకర దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అమెరికా శాంతి చర్చలు విఫలం కావడం, వైమానిక రక్షణ వ్యవస్థల కొరతతో ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన చెందుతోంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉక్రెయిన్ నగరాలపై రష్యా దళాలు భీకర దాడులకు తెగబడ్డాయి. రాజధాని కీవ్ చుట్టుపక్కల భారీ పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్లోని తొమ్మిది నగరాల్లో ఉన్న పారిశ్రామిక వాడలు, చమురు శుద్ధి కర్మాగారాలు, పోర్టులు లక్ష్యంగా భారీ దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో నివాస సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. జపోరిజియా ప్రాంతంలో 78 ఏళ్ల వృద్ధురాలితో పాటు ఖార్కివ్లో మరో వ్యక్తి మరణించారు.














