Terrorist Encounter: కశ్మీర్‌లో ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌.. ‘ఆపరేషన్ అష్దర్’ విజయవంతం! | | ACTPnews

News18


Last Updated:

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. పర్యాటకులను దూద్‌పత్రి ప్రాంతానికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

News18
News18

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లా పఖేర్‌పోరా నుంచి బుద్గామ్‌లోని యూస్‌మార్గ్‌ వైపు ఉగ్రవాదుల బృందం కదులుతోందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గురువారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం అష్దర్ గలీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన సైనికులు వారిని లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడటంతో, భద్రతా బలగాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు ప్రారంభించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports