Last Updated:
మూడేళ్ల క్రితం చోరీ కేసులో కీలక మలుపు. ఫంక్షన్లో దొంగిలించిన చీరను గుర్తించిన బాధితురాలు. పోలీసులు స్వప్న, రాములును అరెస్టు చేశారు.
మూడేళ్ల క్రితం ఇంట్లో జరిగిన దొంగతనం కేసు.. ఎలాంటి ఆధారం లేకుండా అలా ఉండిపోయింది. కానీ ఓ ఫంక్షన్కు వెళ్లిన సమయంలో కనిపించిన చీర ఒక్కసారిగా ఆ పాత కేసును ఛేదించింది. తన ఇంట్లోనే చోరీకి గురైన చీరను మరో మహిళ కట్టుకుని రావడాన్ని గుర్తించిన బాధితురాలు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మూడేళ్ల నాటి దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.














