అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఆ పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో దైవచింతనలో పూర్తిగా మునిగిపోవాలని ఆశిస్తారు. అయితే, భక్తుల ఆధ్యాత్మిక ఆనందానికి వాహనాల హోరు, కర్ణకఠోరమైన హారన్ల మోత తీవ్ర అంతరాయం కలిగిస్తుంటాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని పంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ కీలక అడుగు ముందుకేసింది.














