Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి!


Last Updated:

మాటలు కలిపి మాయ చేసేశారు.. కానీ గంటల వ్యవధిలోనే సీన్ సితార్ చేసిన తిరుమల పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి!
Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి!

కలియుగ వైకుంఠమైన పవిత్ర తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో అక్రమాలకు పాల్పడాలని చూసే నేరస్తులకు సింహస్వప్నంగా మారిన తిరుపతి జిల్లా పోలీసులు మరోసారి తమ పదునైన నిఘా వ్యవస్థను నిరూపించుకున్నారు. భక్తుల భద్రతే పరమావధిగా పనిచేస్తున్న ఖాకీలు వాయువేగంతో స్పందించి, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఓ చోరీ కేసును ఛేదించారు. అత్యంత చాకచక్యంగా మహిళ దృష్టి మళ్లించి దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టి శభాష్ అనిపించుకున్నారు.

సోమవారం ఉదయం తిరుమలలోని రద్దీగా ఉండే లేపాక్షి సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకునే ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌ను పక్కన పెట్టుకుని పనుల్లో నిమగ్నమై ఉంది. సరిగ్గా అదే సమయంలో అక్కడే అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను గమనించారు. నెమ్మదిగా ఆ వ్యాపారి వద్దకు వెళ్లి అనవసరపు మాటలు కలిపి ఆమె దృష్టిని పూర్తిగా మరల్చారు. ఆ క్షణికపాటి ఏమరుపాటును ఆసరాగా తీసుకున్న ఆ కేటుగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా అక్కడున్న హ్యాండ్‌బ్యాగ్‌ను అపహరించి అక్కడి నుంచి ఉడాయించారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: కల్లు రుచి చూసిన చంద్రబాబు.. వీడియో వైరల్, ఏమన్నారంటే..

తన బ్యాగ్ చోరీకి గురైన విషయాన్ని కాసేపటి తర్వాత గుర్తించిన ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసుల కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి సమాచారం అందుకున్న మరుక్షణమే కమాండ్ కంట్రోల్ సిబ్బంది, పెట్రోలింగ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో కొద్ది గంటల్లోనే ఆ ముగ్గురు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. వారి నుంచి దొంగిలించిన నలుపు రంగు లేడీస్ హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు ఐదు వేల రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Summer Holidays Extend: విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు!

పట్టుబడిన నిందితులను లోతుగా విచారించగా వారు వివిధ రాష్ట్రాలకు చెందిన వారని తేలింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు చెందిన ఆనందన్ రమేష్ (42), తిరుచ్చి జిల్లా వాసి అరుణ్ కుమార్ విజయన్ అలియాస్ అరుణ్ (30), ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన గోపు అఖిల్ (31)గా పోలీసులు నిర్ధారించారు. వీరు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి అంతర్రాష్ట్ర స్థాయిలో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇందులో ప్రధాన నిందితుడు ఆనందన్ రమేష్‌ గతంలోనూ తిరుమలలో పలు సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఈ విజయవంతమైన ఆపరేషన్ అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ మాట్లాడుతూ భక్తులకు, వ్యాపారులకు పలు సూచనలు చేశారు. తిరుమల లాంటి రద్దీ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు తమ విలువైన వస్తువులు, నగదు, మొబైల్ ఫోన్లు, బ్యాగుల పట్ల ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తక్షణమే సమీప పోలీసులకు లేదా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై కళ్లుగప్పే వేగంతో స్పందించి సొత్తును రికవరీ చేసిన కమాండ్ కంట్రోల్ సిబ్బందిని, పెట్రోలింగ్ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తిరుమలలో భక్తుల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed