Last Updated:
తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ ఫొటోలతో టీటీడీ గదులు పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు రూమ్ దళారీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు.














