ఈ సంఘటనతో మొదలై.. రాజకీయ ప్రత్యర్థులు కేవలం విజయ్ పాలనను విమర్శించడానికే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రిపై తమ దాడిలో భాగంగా త్రిష పేరును కూడా ఎక్కువగా ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా కావేరి నదీ జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉదయనిధి స్టాలిన్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, మహిళల గౌరవాన్ని అవమానించారని టీవీకే ఆరోపించింది. పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదులు చేయగా, పార్టీ జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించింది, దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.













