సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వద్ద ఒక ఆర్టీసీ బస్సు ఘోర బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుండి కార్ఖానా వైపు అతివేగంగా వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివ అనే ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అక్కడ ఉన్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, స్థానిక వాహనదారులు తక్షణమే స్పందించి క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి శివను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో శివ కాలికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Source link
TRTC Bus Accident | జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు బీభత్సం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports








