Last Updated:
Union Cabinet Meeting: ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ రూ.9,450 కోట్ల వ్యయంతో నాలుగు ప్రధాన రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు (ఆగస్టు 25) కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. దేశ భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతతో అనుసంధానం, సామాన్యుల సంక్షేమం వంటి అంశాలపై ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ, వాణిజ్య వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నేటి సమావేశం టైమింగ్, అందులో తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థపై, దేశ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపనున్నాయి. అసలు మోదీ ప్లాన్ ఏంటి, ఈ రోజు కేబినెట్ ముందున్న ప్రధాన ఎజెండా ఏమిటి అనే అంశాలను పరిశీలిద్దాం.














