Varudu Kalyani | ముగ్గురు పిల్లలను కంటే..పిల్లలను మీరు పోషిస్తారా | ACTPnews

Varudu Kalyani  | ముగ్గురు పిల్లలను కంటే..పిల్లలను మీరు పోషిస్తారా



రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, కూటమి పాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. తాడేపల్లిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. జనాభా పెంచాలని, ముగ్గురు పిల్లలను కనాలని చంద్రబాబు ఇస్తున్న పిలుపుపై సెటైర్లు వేశారు. “ముగ్గురు పిల్లలను కనమంటున్న చంద్రబాబు.. మరి ఆ పిల్లల పోషణ భారమంతా మీరే భరిస్తారా?” అని ప్రశ్నించారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం, ఆర్థిక తోడ్పాటు కోసం ‘అమ్మ ఒడి’ వంటి పథకాలు తెచ్చారని, ప్రస్తుత పాలనలో మహిళలు చీకట్లోకి నెట్టబడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *