Viral News: ఇదెక్కడి గొడవ రా నాయనా.. పులుసు కూర వండిందని భార్యపై కేసు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భర్త కష్టాలు! | | ACTPnews

News18


Last Updated:

భార్య రోజూ పల్చటి కూరే వండుతుందని భర్త అర్ధరాత్రి 112కు కాల్ చేసి పోలీసులను ఇంటికి రప్పించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారింది.
సాధారణ కుటుంబ గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

News18
News18

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం సహజమే. కొన్నిసార్లు ఆ గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను నవ్విస్తుంటాయి. ఇప్పటివరకు లిప్‌స్టిక్, షాపింగ్, మొబైల్ ఫోన్, ఖర్చులు వంటి కారణాలతో దంపతులు గొడవపడిన ఘటనలు చూశాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బదాయూం జిల్లాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భార్య వండిన కూర నచ్చలేదనే కారణంతో ఓ భర్త నేరుగా పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఆసక్తికర ఘటన బదాయూం జిల్లాలోని వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యోలీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే 112 నంబర్‌కు కాల్ చేశాడు. అతడి కాల్ అందుకున్న పోలీసులు ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని భావించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అర్ధరాత్రి గ్రామంలోకి పోలీసు వాహనం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏదైనా పెద్ద గొడవ జరిగిందేమో, లేక నేరం జరిగిందేమోనని భావించి గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడి పరిస్థితి చూసి పోలీసులు మాత్రమే కాదు, గ్రామస్తులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.

పోలీసులు ఇంటి యజమానిని పిలిచి, “ఏమైంది? ఇంత రాత్రి అత్యవసరంగా మమ్మల్ని ఎందుకు పిలిచారు?” అని ప్రశ్నించగా, అతడు చెప్పిన సమాధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. “సార్.. నా భార్య ప్రతిరోజూ నాకు పులుసు కూరలే చేస్తుంది. నాకు మాత్రం పొడి కూర అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. అందుకే మీరే వచ్చి ఆమెకు చెప్పండి” అని ఫిర్యాదు చేశాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, కాల్ చేసిన సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదం జరిగి, కోపంతోనే 112కు కాల్ చేసినట్లు తెలిసింది. పోలీసులు అతడికి ఇలాంటి చిన్న కుటుంబ సమస్యల కోసం అత్యవసర సేవలను వినియోగించకూడదని సూచించి, భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తి చెప్పిన మాటలను వీడియోగా రికార్డు చేశారు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో తన భార్యపై “రోజూ పులుసు కూరే పెడుతోంది.. నాకు పొడి కూర కావాలి” అంటూ భర్త చేసిన ఫిర్యాదు నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. “ఇంత చిన్న విషయానికి కూడా 112కు కాల్ చేస్తారా?”, “పోలీసుల పరిస్థితి ఏంటో!”, “పొడి కూర కోసం పోలీసుల సహాయం కోరిన భర్త” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అత్యవసర సేవలను ఇలాంటి వ్యక్తిగత సమస్యల కోసం వినియోగించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, భార్య వండిన కూర కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports