ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయని కేంద్ర రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నీరు ఖరీఫ్ పంటలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఒకవేళ కరవు వచ్చినా.. ఈ నీటిని వాడి.. కరవు కష్టాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే రైతులు కూడా ముందుగానే పంటలు వేసుకునేలా రెడీ అవ్వాలని సూచించారు. ఒకవేళ వర్షాలు సరిగా పడకపోతే పంటల దిగుబడి తగ్గి, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. మహాపాత్ర ప్రకారం ఉత్తరాంధ్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకూ కొన్ని ప్రాంతాలలో నీటిపారుదల సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో వర్షం తక్కువగా పడితే, ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.













