Women’s T20 World Cup 2026: సచిన్ ఇచ్చిన ఆ చిన్న మెసేజ్ నా మైండ్‌ను రీసెట్ చేసింది: జెమిమా రోడ్రిగ్స్ | క్రీడా వార్తలు | ACTPnews

జెమీమా రోడ్రిగ్స్


Last Updated:

గతేడాది నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పంపిన ఒక టైమ్లీ మెసేజ్ తనను మైండ్ రీసెట్ చేసుకునేలా చేసిందని జెమిమా రోడ్రిగ్స్ పేర్కొంది.

జెమీమా రోడ్రిగ్స్
జెమీమా రోడ్రిగ్స్

Women’s T20 World Cup 2026: భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup) విజయం వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన రహస్యాలను టీమిండియా స్టార్ బ్యాటర్లు జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ తాజాగా వెల్లడించారు. గతేడాది నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పంపిన ఒక టైమ్లీ మెసేజ్ తనను మైండ్ రీసెట్ చేసుకునేలా చేసిందని జెమిమా రోడ్రిగ్స్ పేర్కొంది.

ఆస్ట్రేలియాపై జెమిమా ఆడిన అజేయ 127 పరుగుల ఇన్నింగ్స్ భారత్‌ను తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించింది. అయితే ఆ ఆనందంలో కొట్టుకుపోకుండా సచిన్ ఇచ్చిన సలహా తనను గ్రౌండెడ్‌గా ఉంచిందని ఆమె తెలిపింది.

సచిన్ సర్ నా కోచ్‌కు ఫోన్ చేశారు: జెమిమా

ఆనాటి జ్ఞాపకాలను జెమిమా గుర్తుచేసుకుంటూ.. “సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారీ ఇన్నింగ్స్ ఆడటం, వారిని ఓడించిన ఆనందంలో గత రెండు రోజులుగా నా చుట్టూ చాలా హడావుడి నడిచింది. ఆ సమయంలో సచిన్ సర్ నా కోచ్ ప్రశాంత్ శెట్టికి ఫోన్ చేసి, నాకు ఒక సందేశాన్ని చేరవేయమని చెప్పారు” అని తెలిపింది.

సచిన్ పంపిన సందేశాన్ని వివరిస్తూ.. “అసలు పని ఇంకా పూర్తి కాలేదని సచిన్ సర్ నాకు గుర్తుచేశారు. మనం ఇంకా ఫైనల్ గెలవాల్సి ఉంది. ఆ సెమీస్ విజయాన్ని పక్కన పెట్టి, ఫైనల్లో మళ్లీ ‘జీరో’ నుండి ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆయన చెప్పారు. ఆ మెసేజ్ నా మైండ్‌ను రీసెట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది” అని జెమిమా పేర్కొంది.

గతంలో మనం ఏం చేశామనేది తర్వాతి మ్యాచ్‌లో మనల్ని గెలిపించదని, ప్రతి మ్యాచ్‌ను ఒక కొత్త ఆరంభంగా చూడాలని తాను అర్థం చేసుకున్నానని, ఆ దిగ్గజం ఇచ్చిన సలహా ఫైనల్‌కు ముందు తనకు ఎంతో స్పష్టతనిచ్చిందని జెమిమా జోడించింది.

నన్ను రగిలించిన తండ్రి వాయిస్ నోట్: షెఫాలీ వర్మ

ఆస్ట్రేలియాను దాటుకుని ఫైనల్ చేరిన భారత్.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో 87 పరుగులతో పాటు 2/36 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను గెలిపించిన షెఫాలీ వర్మ.. ఫైనల్‌కు ముందు తన తండ్రి ఇచ్చిన మోటివేషన్ గురించి మాట్లాడింది.

“ఫైనల్‌కు ముందు మాకు రెండు రోజులు గ్యాప్ దొరికింది. ఆ సమయంలో మా నాన్న నాకు ఒక వాయిస్ నోట్ పంపారు. ‘కష్టపడి ఆడు, మైదానంలో నీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వు. షెఫాలీ వర్మ భారత్‌కు ప్రపంచకప్ అందించిందని చరిత్రలో లిఖించబడాలి’ అని ఆ వాయిస్ నోట్‌లో చెప్పారు” అని షెఫాలీ తెలిపింది.

ఆ వాయిస్ నోట్ తనలో మరింత కసిని (Extra Fire) రగిల్చిందని, కేవలం తన కోసమే కాకుండా తన తండ్రి కోసం, దేశం కోసం రాణించాలనే పట్టుదలతో మైదానంలో సర్వస్వం ఒడ్డి ఆడానని షెఫాలీ వివరించింది.

ఇప్పుడు కన్ను టీ20 వరల్డ్ కప్‌పైనే..

వన్డే ప్రపంచకప్ ఛాంపియన్లుగా నిలిచిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు తమ తదుపరి లక్ష్యమైన టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) పై దృష్టి సారించింది. డిఫెండింగ్ ఛాంపియన్ల హోదాలో బరిలోకి దిగుతున్న భారత్.. ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports