Last Updated:
అయోధ్య రామమందిరం తొలి CEO పదవి కోసం ఏకంగా 5,585 మంది దరఖాస్తు చేశారు. కానీ చివరకు ఆ బాధ్యత ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది? ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతోంది? పూర్తి వివరాలు ఇవే.
అయోధ్యలోని భవ్య రామమందిర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎంపిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, భక్తులకు అందించే సౌకర్యాలు, సంస్థాగత కార్యకలాపాలను సమన్వయం చేసే ఈ కీలక పదవికి దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. మొత్తం ఎంపిక ప్రక్రియను ప్రతిభ, అనుభవం, పారదర్శకత, సంస్థాగత సామర్థ్యాల ఆధారంగా నిర్వహించినట్లు సెర్చ్ కమిటీ కార్యదర్శి సమీర్ పాండా తెలిపారు.














