Last Updated:
ఆ సినిమా హిట్ అవ్వాలని శ్రీవారి సన్నిధిలో స్టార్ ప్రొడ్యూసర్.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే?
కలియుగ వైకుంఠంగా, భక్తజన కల్పతరువుగా పేరుగాంచిన తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం నిత్యం అశేష భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. సామాన్య భక్తులతో పాటుగా దేశం నలుమూలల నుంచి వచ్చే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు తరచుగా ఇక్కడకు విచ్చేసి శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. తాము ప్రారంభించే కొత్త ప్రాజెక్టులు, ఇతర పనులు ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆ ఏడుకొండల వాడిని ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకుంటారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ, టాలెంటెడ్ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిభావంతో దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.













