Last Updated:
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి రోజువారీ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడంతో పాటు హైదరాబాద్–చెన్నై నాన్స్టాప్ విమానాలను కూడా పునఃప్రారంభిస్తోంది.
Hyderabad Tirupati Flights: దక్షిణ భారతదేశంలో తన విమాన సర్వీసులను మరింత విస్తరించే దిశగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజువారీ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త సర్వీసులు సెప్టెంబర్ 1, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.














