బిర్యానీ లవర్స్‌కు షాక్.. మెహెఫిల్, షా గౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. బయటపడిన షాకింగ్ నిజాలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

హైదరాబాద్‌లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు.

News18
News18

హైదరాబాద్‌లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. అలాంటి ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తాజాగా ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిచెన్‌లోకి వెళ్లి పరిశీలించగా పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల్లో ముఖ్యంగా వంటగది పరిశుభ్రంగా లేకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కిచెన్ ఫ్లోర్ మొత్తం తడిగా ఉండటం, శుభ్రత సరిగా పాటించకపోవడం కనిపించింది. గ్రిల్ చేసిన చికెన్‌ను సరైన విధంగా భద్రపరచకుండా కిచెన్‌లోనే ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానంలో కూడా పలు లోపాలు ఉన్నట్లు వెల్లడించారు.

అంతేకాదు, నిర్మాణ పనులకు సంబంధించిన సామగ్రి పక్కనే రుమాలీ రోటీలు తయారు చేస్తుండటం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఆహారం తయారు చేసే ప్రాంతంలో నిర్మాణ సామగ్రి ఉండటం ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. వంట చేసే ప్రదేశంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని రెస్టారెంట్ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం.

ఇదే సమయంలో గచ్చిబౌలిలోని ప్రముఖ షా గౌస్ రెస్టారెంట్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా పరిశుభ్రత విషయంలో పలు లోపాలు గుర్తించినట్లు తెలిసింది. ఆహారం తయారీ, నిల్వ, వంటగది నిర్వహణలో కొన్ని నిబంధనలు సరిగా అమలు కావడం లేదని అధికారులు గుర్తించారు.

ఆహారం తయారుచేసే ప్రతి హోటల్, రెస్టారెంట్ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వంటగది పరిశుభ్రంగా ఉండటం, ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, సిబ్బంది పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లోని పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని హోటళ్లపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

తాజా తనిఖీల్లో బయటపడిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బిర్యానీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తినే ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఆహార భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని రెస్టారెంట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports