టీమిండియా నెంబర్ 1.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్ | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జింబాబ్వేపై అద్భుత విజయంతో భారత జట్టు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

News18
News18

భారత క్రికెట్ జట్టు మళ్లీ అదరగొట్టింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా, కేవలం రెండు వారాల్లోనే ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఈ అరుదైన ఫీట్ అందుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్, తాజా విజయంతో 268 రేటింగ్ పాయింట్లను సాధించినట్లు ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఇంగ్లాండ్ ఖాతాలో కూడా సరిగ్గా 268 పాయింట్లే ఉన్నా, దశాంశ లెక్కల ఆధారంగా భారత్ పైచేయి సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 29 బంతుల్లోనే 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోరును అమాంతం పెంచాడు.

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. కేవలం 81 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ స్కోరుతో 2026 క్యాలెండర్ ఇయర్‌లో అతను భారత్ తరఫున 22 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 783 పరుగులు సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. 2022లో కోహ్లీ 20 మ్యాచ్‌లు ఆడి 781 పరుగులు చేశాడు.

ICC T20I Team Rankings after July 25, 2026 update.
లక్ష్యంగా సూర్యకుమార్, అభిషేక్ శర్మ

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డులో ఇషాన్ కిషన్ ముందు ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. 2022లో 31 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 1,164 పరుగులు చేయగా, 2025లో 21 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 859 పరుగులు సాధించాడు. ఆదివారం జింబాబ్వేతో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ మెరుగైన స్కోరు సాధిస్తే అభిషేక్ శర్మ రికార్డును దాటే అవకాశం పుష్కలంగా ఉంది. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ అతను ఈ మైలురాయిని సులభంగా అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

సంజూ శాంసన్ రికార్డుపై గురి

ప్రస్తుతం భారత జట్టు పూర్తిస్థాయి వికెట్ కీపర్ పాత్రను పోషిస్తున్న ఇషాన్, 2026లో ఆడిన 12 మ్యాచ్‌లలో 370 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మరో రికార్డు అతడి ముందుంది. ఆదివారం జరిగే మూడో టీ20లో ఇషాన్ మరో 67 పరుగులు చేస్తే, ఒక క్యాలెండర్ ఇయర్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన సంజూ శాంసన్ రికార్డు బద్దలవుతుంది. 2024లో శాంసన్ 12 మ్యాచ్‌లు ఆడి 436 పరుగులు చేశాడు. ఈ టూర్‌లో ఇషాన్ బ్యాటింగ్ ఫామ్ చూస్తుంటే ఈ రికార్డు కూడా త్వరలోనే కనుమరుగయ్యేలా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports