Last Updated:
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, డిజిటల్ విప్లవంపై దృష్టి.
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 15, 1947న భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసిన ఆమె.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. సైనికుల త్యాగం నుంచి మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, డిజిటల్ విప్లవం, పర్యావరణ పరిరక్షణ వరకు అనేక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.














