Last Updated:
తిరుమల శ్రీవారి ఆలయ వస్త్రాల ఈ-వేలం సెప్టెంబరు 21-23 వరకు జరుగుతుంది. టీటీడీ 132 కొత్త ఆర్ట్ సిల్క్ చీరల లాట్లను విక్రయిస్తుంది. వివరాలు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకల్లోని వస్త్రాలు ఇప్పుడు ఈ-వేలం ద్వారా అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 21 నుంచి 23వ తేదీ వరకు ఈ-వేలం నిర్వహించనున్నారు. ఇందులో కొత్త ఆర్ట్ సిల్క్ చీరలకు సంబంధించిన 132 లాట్లను విక్రయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.














