Last Updated:
80th Independence Day 2026: ఇటీవలి వరుస ఘటనలతో యూత్కి దూరం అయినట్లు ఫీలవుతున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఎర్రకోటలో.. జెన్ జీని ఆకర్షించేందుకు కీలక ప్రసంగం చేసే ఛాన్స్ ఉంది. పోయిన సపోర్టును తిరిగి పొందేందుకు ఆయన ఏమంటారో అనే ఆసక్తి దేశ ప్రజల్లో ఉంది.
భారతదేశం ఈరోజు (ఆగస్టు 15) తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ఆయన 13వ వరుస స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం అని ఇండియా టీవీ న్యూస్ రిపోర్ట్ చేసింది.














