తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే బుకింగ్ తేదీలను గమనించాలని టీటీడీ సూచిస్తోంది.













