Madhya Pradesh: వీడెవడండీ బాబు.. బాబాగా మారాలని మధ్యప్రదేశ్ రైతు పిచ్చి పని.. ఏకంగా దాన్నే గొడ్డలితో నరుక్కున్నాడు! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక రైతు సాధువుగా మారాలనే కోరికతో ఒక పిచ్చి పని చేశాడు. అతడు చేసిన పని ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది. ఏకంగా తన శరీరంలోని ఒక అవయవాన్ని కోసుకొని బావిలో విసిరేశాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Madhya Pradesh: కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన ఒక వ్యక్తిని ఎంతటి ఘోరమైన నిర్ణయానికి పురిగొల్పుతాయో నిరూపించే ఒక విస్తుపోయే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. బాబాగా (సాధువుగా) మారిపోవాలనే తీవ్రమైన ఉన్మాదంతో ఒక 42 ఏళ్ల రైతు గొడ్డలితో తన జననాంగాన్ని తానే నరుక్కుని బావిలో పారేసుకున్నాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ భయంకరమైన సంఘటన ఛతర్‌పూర్ జిల్లా మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పాపభీతి.. బాబాగా మారాలనే పిచ్చి

ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. సదరు రైతు గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి, వేదనకు లోనవుతున్నాడు. సంసార సాగరం, కుటుంబ బాధ్యతల నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని, పాపభీతి నుంచి తప్పుకుని ఒక బాబాగా మారిపోవాలని అతడు బలంగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, తన శరీరంలోని ఒక నిర్దిష్ట భాగమే (జననాంగం) తన పాపభరిత ఆలోచనలకు కారణమని అతడు భావించాడు. దానిని ఎలాగైనా తొలగించుకోవాలనే పిచ్చితో శనివారం ఉదయం తన పొలంలోని బావి వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో జననాంగాన్ని నరుక్కుని, ఆ ముక్కను బావిలోకి విసిరేశాడు.

కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం

ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన అనంతరం, తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ఆ రైతు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చేసిన పనిని వివరించాడు. సమాచారం అందుకుని హుటాహుటిన పొలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఛతర్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతడి శరీరంలో తీవ్రంగా రక్తస్రావం జరిగిందని, పరిస్థితిని గమనిస్తూ చికిత్స కొనసాగిస్తున్నామని డాక్టర్ మనోజ్ చౌదరి మీడియాకు వెల్లడించారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులే కారణమా?

ఈ ఘోర నిర్ణయానికి వెనుక సదరు రైతు అనుభవిస్తున్న కుటుంబ, ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. బాధితుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి భార్య చాలా కాలంగా పక్షవాతం (పక్షవాత రోగం)తో మంచానికే పరిమితమై బాధపడుతోంది. కాగా, పెద్ద కుమార్తె వివాహం జూన్ 25న జరగాల్సి ఉంది. ఒకవైపు కూతురి పెళ్లి కాబోతుండటం, మరోవైపు భార్య ఆరోగ్యం క్షీణించడం, వీటన్నింటికీ తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ రైతు కొద్దిరోజులుగా తీవ్రమైన మానసిక వేదనతో సతమతమవుతున్నాడు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక, విముక్తి మార్గం కోసం బాబాగా మారాలనే భ్రమలో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *