Tirupati Viral Video: ఓర్ని.. టీ తాగినంత ఈజీగా కిడ్నాప్ చేస్తారా? తిరుపతిలో షాకింగ్ వీడియో వెలుగులోకి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

కిడ్నాప్ వీడియో కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

+

News18

ఆధ్యాత్మిక నగరి తిరుపతి నగరంలో పట్టపగలే జరిగిన ఓ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రసూల్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కిడ్నాప్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ టీ షాప్ వద్ద శనివారం సాయంత్రం వేళ ఈ దురాగతం చోటుచేసుకుంది. టీ తాగుతూ నిలబడిన రసూల్‌ను దుండగులు బలవంతంగా ఓ వాహనంలో ఎక్కించుకుని అక్కడినుంచి క్షణాల్లో పరారయ్యారు.

ఈ కిడ్నాప్ ఆపరేషన్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నిందితులు వ్యాపారిని కారులోకి నెట్టేస్తున్న దృశ్యాలు ఆ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలే పోలీసుల దర్యాప్తులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర విచారణను ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Hyderabad News: హైదరాబాదీలకు భారీ గుడ్ న్యూస్.. 11 ఏళ్ల నిరీక్షణకు తెర!

అయితే ఈ అపహరణ వెనుక భారీ స్థాయి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. రసూల్ ఇటీవల ఎర్రచందనం చెట్లు ఉన్న ఓ భారీ వెంచర్ డీల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి కోట్ల రూపాయల విలువైన ఈ భూ వ్యవహారం నడిపినట్లు సమాచారం. ఈ ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన తీవ్ర విభేదాలు, భూ వివాదాలు, లేదా మరేదైనా కక్షలే ఈ కిడ్నాప్‌కు ప్రధాన కారణమా అనే దిశగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: Summer Holidays Extend: విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు!

కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. వ్యాపారిని వీలైనంత త్వరగా సురక్షితంగా రక్షించేందుకు అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ సహా, రసూల్ మొబైల్ కాల్ డేటా, టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలికలు తదితర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. నిందితుల జాడను పసిగట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

మరోవైపు అపహరణకు గురైన రసూల్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. తమ వారిని ఎవరైనా క్షేమంగా విడిచిపెట్టాలని, పోలీసులు వెంటనే స్పందించి కాపాడాలని వారు ప్రాధేయపడుతున్నారు. ఈ కిడ్నాప్ వెనుక దాగి ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది పూర్తి విచారణలో తేలనుంది. ఘటనకు సంబంధించి వాస్తవాలు, అలాగే దర్యాప్తు పురోగతిపై పోలీసులు త్వరలో మీడియాకు అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports