నాగ చైతన్య కేవలం హిట్ సినిమాలనే కాదు.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన కొన్ని చిత్రాలను కూడా రిజెక్ట్ చేశారు. అల్లు శిరీష్ నటించిన ‘గౌరవం’, సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ డ్రామా ‘రిపబ్లిక్’, శర్వానంద్-సిద్ధార్థ్ మల్టీస్టారర్ ‘మహా సముద్రం’ వంటి సినిమాలు కూడా మొదట చైతు వద్దకే వచ్చాయట. ఈ చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో, వీటిని వదులుకుని చైతు మంచి పనే చేశాడని అక్కినేని అభిమానులు ఊరట చెందుతుంటారు. ఏదేమైనా ‘కొత్త బంగారు లోకం’, ‘అ..ఆ’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలను మిస్ చేసుకోవడం చైతన్య కెరీర్లో పెద్ద మైనస్ అనే చెప్పాలి.













