Last Updated:
Tirupati: డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం, ఆపై ప్రేమ, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం.. తీరా పెళ్లికి ముందే ఆస్తులు, డబ్బుల కోసం వేధింపులు మొదలయ్యాయి.
మనస్పర్ధలతో నిశ్చితార్థం రద్దయితే, కేసుల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ రూ. 3 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఓ యువతి బెదిరింపులకు దిగిన విస్తుపోయే ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. ఈనాడు కథనం ప్రకారం.. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన వంశీ, చెన్నైలోని ప్రముఖ విజయ హాస్పిటల్లో సైంటిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ప్రముఖ డేటింగ్ యాప్ ద్వారా హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన నమ్రత అనే యువతితో పరిచయం ఏర్పడింది. నమ్రత మ్యాక్స్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఏడాది క్రితం వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు.














