Annamalai: అన్నామలై రాజీనామా.. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కి అందజేత.. సా.4కి అమిత్‌ షాతో భేటీ | | ACTPnews

అన్నామలై (Image - PTI)


Last Updated:

Tamilnadu: అన్నామలై తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు సమర్పించారు. చెన్నైకి బయలుదేరే ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు.

అన్నామలై (Image - PTI)
అన్నామలై (Image – PTI)

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసిన ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. చెన్నైకి బయలుదేరే ముందు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాజీనామాకు దారితీసిన పరిస్థితులు:

అధిష్ఠానంతో విభేదాలు: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే (AIADMK)తో పొత్తు పెట్టుకోవడాన్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో బీజేపీని సొంతంగా, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన కోరుకున్నారు. కానీ, జాతీయ నాయకత్వం పొత్తుకే మొగ్గుచూపింది. ఈ ఎన్నికల్లో ఆ వ్యూహం దారుణంగా విఫలమైంది.

ఇవి కూడా చదవండి: Weather today: ఆవర్తనాల జోరు.. ఏపీ, తెలంగాణలో కుమ్మేసే వర్షాలు.. పిడుగుల టెన్షన్

పదవీచ్యుతి: 2025లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి అన్నామలైని తప్పించి, ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్‌ను అధిష్ఠానం నియమించింది. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. కోయంబత్తూరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు.

విజయ్ సీఎం కావడం, మారిన రాజకీయ ముఖచిత్రం:

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై అన్నామలై స్పందిస్తూ.. “రాష్ట్రంలో ద్రావిడ శకం ముగిసింది. ప్రస్తుతం విజయ్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు ఎవరూ లేరు. కేవలం భాషా పరమైన అంశాలపై ఆధారపడే రాజకీయాలు ఇకపై పనిచేయవు” అని తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తానే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆయన భావిస్తున్నారు.

బీజేపీతో సామరస్యంగా విడిపోయి, తనకంటూ ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకోవాలని అన్నామలై నిర్ణయించుకున్నారు. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త ప్రజా ఉద్యమాన్ని లేదా నూతన రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే కోయంబత్తూరు, మధురై తదితర ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు “మా నాయకుడా రా.. మమ్మల్ని నడిపించు”, “తమిళనాడును రక్షించడానికి మీ తదుపరి అవతారం ఎత్తండి” అంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. తన భవిష్యత్ కార్యాచరణపై మరో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని అన్నామలై ప్రకటించారు. అయితే, ఆయనను పార్టీలోనే కొనసాగేలా ఒప్పించేందుకు, జాతీయ స్థాయిలో ఒక కీలక బాధ్యతను అప్పగించేందుకు బీజేపీ నాయకత్వం చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed