ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. మరోవైపు భల్లాలదేవ పాత్రలో రానా దగ్గుబాటి తన విలనిజంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే దేవసేన పాత్రలో అనుష్క శెట్టి, శివగామి పాత్రలో రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, అవంతికగా తమన్నా భాటియా, బిజ్జలదేవగా నాజర్, కుమారవర్మ పాత్రలో సుబ్బరాజు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.













