Last Updated:
Delhi Road Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మోదీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, గతి శక్తి, నగరాల మెరుగైన కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది అనేందుకు ఇదో ఎగ్జాంపుల్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) ఢిల్లీలో ఒక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు ఆమోదం ఇచ్చింది. ఇది ఢిల్లీ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ముఖ్యమైన అడుగు. NH-148AE కింద 6-లేన్ రోడ్ టన్నెల్ నిర్మాణం, ద్వారక ఎక్స్ప్రెస్వే (NH 248 BB) నుంచి నెల్సన్ మండేలా మార్గ్, వాసంత్ కుంజ్తో కనెక్ట్ చేస్తుంది. మొత్తం ప్రాజెక్ట్ పొడవు 8.1 కిలోమీటర్లు. మొత్తం ఖర్చు రూ.6,969.67 కోట్లు. హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (HAM) లో NH (O) స్కీమ్ కింద దీన్ని అమలు చేస్తారు.
ప్రధాని మోదీ దూరదృష్టి, అభివృద్ధి:
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మోదీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, గతి శక్తి, నగరాల మెరుగైన కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది అనేందుకు ఇదో ఎగ్జాంపుల్. ఈ ప్రాజెక్ట్.. పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. గురుగ్రామ్, ద్వారక, IGI ఎయిర్పోర్ట్, పశ్చిమ ఢిల్లీ నుంచి దక్షిణ ఢిల్లీ వైపు వెళ్లే ట్రాఫిక్కు బాగా ఉపయోగపడుతుంది.
ప్రాజెక్ట్లో ట్విన్-ట్యూబ్ అండర్గ్రౌండ్ టన్నెల్.. అంటే TBM ద్వారా నిర్మాణం ఉంటుంది. ఇది సర్ఫేస్ డిస్టర్బెన్స్ను తగ్గించి, సదరన్ రిడ్జ్ ఫారెస్ట్ను కాపాడుతుంది. రిడ్జ్ కింద 1.98 కిలోమీటర్ల సెక్షన్ టన్నెల్ పాస్ అవుతుంది. ఇది ఢిల్లీ ‘లంగ్స్’ను సంరక్షిస్తూ అభివృద్ధిని సాధిస్తుంది. శివమూర్తి ఇంటర్చేంజ్ నుంచి ప్రారంభమై నెల్సన్ మండేలా మార్గం ఇంటర్సెక్షన్ ముందు ముగుస్తుంది. అదనంగా 1.8 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్, ఫ్లైఓవర్లు, U-టర్న్లు కూడా ప్రతిపాదించారు. మెయిన్ క్యారేజ్వే 6.3 కిలోమీటర్లు, టన్నెల్ 3.14 కిలోమీటర్లు, ఎలివేటెడ్ పోర్షన్ 2.556 కిలోమీటరక్లతో మొత్తం 8.1 కిలోమీటర్లు అవుతుంది. NHAI ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తుంది. AIIMS-మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్, బరాపుల్లా ఎలివేటెడ్ రోడ్తో కనెక్ట్ చేసి తూర్పు ఢిల్లీ, ఘాజియాబాద్, నోయిడాకు కూడా లింక్ ఏర్పాటు చేస్తుంది.
ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు:
ప్రతి లేన్ కిలోమీటర్ నేషనల్ హైవే అభివృద్ధికీ యావరేజ్గా 264 డైరెక్ట్ పర్సన్-డేస్, 55 ఇండైరెక్ట్ పర్సన్-డేస్ ఉపాధి కల్పిస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ సుమారు 7.54 లక్షల డైరెక్ట్, 9.80 లక్షల ఇండైరెక్ట్ పర్సన్-డేస్ ఉపాధి అందిస్తుంది. చుట్టుపక్కల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి అదనపు ఉపాధి అవకాశాలు పుడతాయి. ఇది మోదీ ప్రభుత్వ ‘ఉపాధి సృష్టి’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు ఉపయోగపడుతుంది. 5 సంవత్సరాల్లో పూర్తి చేసే లక్ష్యంతో ఆగస్టు నుంచి బిడ్స్ ప్రారంభమవుతాయి.
ఈ టన్నెల్ ఢిల్లీలోని కీలక ట్రాఫిక్ కష్టాల్ని తగ్గించి, రోజువారీ యాత్రికులకు సౌకర్యం కల్పిస్తుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మెరుగుపడి, బిజినెస్, టూరిజం పెరుగుతాయి. పర్యావరణానికి హాని కలగకుండా ఆధునిక TBM టెక్నాలజీ ఉపయోగించడం మోదీ ప్రభుత్వ సస్టైనబుల్ డెవలప్మెంట్ విధానానికి ఉదాహరణ. ఇది NCRలో మొత్తం మొబిలిటీని మెరుగుపరుస్తుంది.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అసాధారణ ప్రగతిని సాధిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంతోపాటు జాతీయ అభివృద్ధికి దోహదపడుతుంది. మోదీ ప్రభుత్వం ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వేగవంతమైన, పర్యావరణ ఫ్రెండ్లీ పరిష్కారాలు అందిస్తోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు భారత్ను వికసిత భారత్గా మార్చడంలో కీలకం.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 02, 2026 11:58 AM IST













