Last Updated:
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న వేళ.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొత్త బిజినెస్ అవకాశంగా మారుతున్నాయి. ఫ్రాంచైజీ మోడల్ ద్వారా ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఆసక్తికరమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొత్త అవకాశంగా మారుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ను ఫ్రాంచైజీ మోడల్లో విస్తరిస్తున్న భారత్ ఛార్జ్, పెట్టుబడిదారులకు ఈ అవకాశాన్ని అందిస్తోంది. భారత్ ఛార్జ్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 150కి పైగా ఛార్జర్లను నడుపుతోంది. ఈ కంపెనీని ప్రద్యుమ్న ఏనుగుల ఫౌండర్, సీఈఓ, మేనేజింగ్ పార్ట్నర్గా నడిపిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడిదారులు భాగం కావడానికి ఈ ఫ్రాంచైజీ అవకాశం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. “ఈవీ ఛార్జింగ్ రంగం ప్రస్తుతం వ్యాపారాలు, పెట్టుబడిదారులకు చాలా కీలకమైన దశలో ఉంది. ఇది ఈవీ యుగంలో పెట్రోల్ బంక్లాంటి అవకాశం. అది కూడా ఇప్పుడే జరుగుతోంది” అని న్యూస్18 తెలుగుతో మాట్లాడిన ప్రద్యుమ్న ఏనుగుల అన్నారు.














