Last Updated:
Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మజ్లీస్ పార్టీకి చెందిన నాయకుడిపై దాడి జరిగింది. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి అల్మాస్ హోటల్ దగ్గర AIMIM పార్టీ ఏరియా అధ్యక్షుడు మెహబూబ్ అలీ హత్యపై గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు.
Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆదివారం రాత్రి మజ్లీస్ పార్టీకి చెందిన నాయకుడిపై దాడి జరిగింది. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి అల్మాస్ హోటల్ దగ్గర ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM)పార్టీ ఏరియా అధ్యక్షుడు మెహబూబ్ అలీ హత్యపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. కత్తిపోట్లకు గురైన మహబూబ్ అలీ తీవ్రరక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. హంతకుడు ఎవరూ..? పాతబస్తీలో అది కూడా మజ్లీస్ పార్టీకి చెందిన నాయకుడిపై మర్డర్ ప్లాన్ చేసింది ఎవరని ఆరా తీస్తున్నారు.














