IPL 2026: ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు బీసీసీఐ వార్నింగ్.. అవి వాడొద్దంటూ ఆంక్షలు | క్రీడా వార్తలు | ACTPnews

ఐపీఎల్ ట్రోఫీ


Last Updated:

కొన్ని కంపెనీలు ఈ రకమైన అత్యాధునిక డివైజ్‌లను ఆటగాళ్లకు, జట్టు అధికారులకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాయని ‘యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్’ (ACSU) బీసీసీఐని హెచ్చరించింది.

ఐపీఎల్ ట్రోఫీ
ఐపీఎల్ ట్రోఫీ

IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన లీగ్ ఐపీఎల్‌లో సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికంగా అత్యంత అధునాతన కమ్యూనికేషన్ పరికరాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో… ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మ్యాచ్ జరిగే సమయంలో స్మార్ట్ గ్లాసెస్ (Smart Glasses), సన్‌గ్లాసెస్, గాగుల్స్ ధరించడంపై ఐపీఎల్ సరికొత్త మార్గదర్శకాలను (Advisory) జారీ చేసింది. కొన్ని కంపెనీలు ఈ రకమైన అత్యాధునిక డివైజ్‌లను ఆటగాళ్లకు, జట్టు అధికారులకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాయని ‘యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్’ (ACSU) బీసీసీఐని హెచ్చరించింది.

ఒక ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రకారం.. ఈ స్మార్ట్ ఐవేర్ (కళ్లద్దాలు) ఉత్పత్తుల ద్వారా వై-ఫై (Wi-Fi) లేదా మొబైల్ డేటాను ఉపయోగించి లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చని, టెక్స్ట్ మెసేజ్‌లు పంపుకోవచ్చని, అలాగే ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడవచ్చని ఏసీఎస్‌యూ బోర్డుకు తెలిపింది. దీనివల్ల లైవ్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు సమాచారం బయటకు చేరి, మ్యాచ్ ఫిక్సింగ్ లేదా స్పాట్ ఫిక్సింగ్ వంటి అక్రమాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

“ధరించగలిగే సాంకేతికత (Wearable Technology) రోజురోజుకూ మరింత అధునాతనంగా మారుతోంది. రహస్య సమాచార మార్పిడి పద్ధతులపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో.. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత వాణిజ్య ప్రాధాన్యత కలిగిన ఈ టోర్నమెంట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తుగా అడ్డుకట్ట వేసేందుకే ఏసీఎస్‌యూ ఈ కఠిన చర్యలు చేపట్టింది” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత సీజన్ లో ఆటగాళ్లు, జట్టు యాజమాన్యాలు మరియు అధికారులు సెక్యూరిటీ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ… ఈ నెల ప్రారంభంలోనే ఎనిమిది పేజీల కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. ఆ తర్వాత లీగ్‌లో భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

“ప్రస్తుత ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సమయంలో కొందరు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మరియు టీమ్ అధికారులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లు, ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బీసీసీఐ దృష్టికి వచ్చింది” అని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేశారు.

“ఇలాంటి ఘటనలను మనం ఇప్పుడే అదుపు చేయకపోతే.. భవిష్యత్తులో టోర్నమెంట్ ప్రతిష్టతో పాటు, సంబంధిత ఫ్రాంచైజీకి మరియు గవర్నింగ్ బాడీగా ఉన్న బీసీసీఐ గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా, ఇది సదరు వ్యక్తులను, ఫ్రాంచైజీలను తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లోకి, భద్రతాపరమైన ప్రమాదాల్లోకి నెట్టే అవకాశం ఉంది” అని ఆయన హెచ్చరించారు.

కాగా, ఈ సీజన్ లోనే రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు చెందిన ఒక మేనేజర్.. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత నిబంధనల ఉల్లంఘన కింద బీసీసీఐ ఆ మేనేజర్‌పై జరిమానా విధించి, కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports