Trending Video: ‘నేను పోలీస్.. నాకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలి’.. వాయించి వదిలారు, వీడియో వైరల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Trending


Last Updated:

రక్షక భటుడా? భక్షకుడా? తిరుపతిలో తాగి కర్రీ పాయింట్‌లో పోలీస్ బీభత్సం.. కాలర్ పట్టుకుని మరీ..

+

Trending Video: ‘నేను పోలీస్.. నాకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలి’.. వాయించి వదిలారు, వీడియో వైరల్!

రక్షక భటుడు అని గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తే, మద్యం మత్తులో భక్షకుడిగా మారిన తరుణమిది. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే, కర్రీ పాయింట్ యజమాని కాలర్ పట్టుకుని రౌడీలా ప్రవర్తించడంతో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. తిరుపతిలో గురువారం రాత్రి ఓ ఏఎస్ఐ చేసిన రచ్చ, పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారింది.

ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని సత్యనారాయణపురం ప్రాంతంలో గురువారం రాత్రి కాసేపు భయానక వాతావరణం నెలకొంది. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాము అనే వ్యక్తి, ఈ హైడ్రామాకు తెరలేపారు. విధుల్లో ఉన్నాడో లేదో తెలియదు కానీ, లోపల మాత్రం మద్యం మత్తు ఏమాత్రం తగ్గలేదు. తాగి ఊగుతున్న అతడు, స్థానికంగా ఉన్న పూర్విక కర్రీ సెంటర్‌కు చేరుకుని, బిర్యానీతో పాటు చికెన్ కర్రీ పార్సిళ్లు తీసుకున్నాడు. సాధారణ పౌరుడిలా డబ్బులు చెల్లించి వెళ్లాల్సిన ఆ అధికారి, తన ఖాకీ దర్పం ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు.

ఇది కూడా చదవండి: Tirupati News: తిరుపతిలో హైఅలర్ట్.. మరోసారి కలకలం, పరుగులు పెట్టిన భక్తులు!

పార్సిళ్లు తీసుకున్న తర్వాత ఏఎస్ఐ రాము, డబ్బులు చెల్లించకుండానే అక్కడి నుంచి నైస్‌గా జారుకోవడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని, “సార్.. బిల్లు చెల్లించండి” అని వినయంగా కోరారు. సామాన్యుడు డబ్బులు అడిగితే ఆ ఖాకీ అహంకారం దెబ్బతిన్నట్లుంది. వెంటనే మద్యం మత్తులో ఉన్న రాము, హోటల్ సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. “నేనెవరో తెలుసా? పోలీసును.. నన్నే డబ్బులు అడుగుతారా? నాకు ఉచితంగా భోజనం ఇవ్వాలి” అంటూ దురుసుగా ప్రవర్తించాడు. హోటల్ యజమాని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ వినలేదు. సగటు పౌరుడిపై చట్టం చూపే వ్యక్తి, ఇక్కడ చట్టాన్ని తుంగలో తొక్కాడు.

ఇది కూడా చదవండి: New Courses: వీళ్లకు పండగే.. నెలకు 7 వేలు, ఈ కొత్త కోర్సుల వివరాలు తెలుసుకోండి!

హోటల్ నిర్వాహకులు డబ్బులు అడగటమే నేరమన్నట్లు, ఏఎస్ఐ రాము నోటికి పనిచెప్పాడు. అత్యంత అసభ్య పదజాలంతో హోటల్ సిబ్బందిని, యజమానిని బూతులు తిట్టాడు. మద్యం మత్తు, ఖాకీ దర్పం రెండూ కలవడంతో అతడి ప్రవర్తన మితిమీరిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో, వారి మధ్య తోపులాట మొదలైంది. ఒకరినొకరు నెట్టుకోవడం నుంచి, చివరకు పరిస్థితి అదుపుతప్పి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకునే స్థాయికి చేరిందని స్థానికులు తెలిపారు. నడిరోడ్డుపై ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా రౌడీలా కొట్టుకోవడం చూసి పక్కనే ఉన్నవారు షాక్‌కు గురయ్యారు.

ఘటన జరుగుతున్న సమయంలో హోటల్ వద్ద చాలామంది గుమిగూడారు. స్థానికులు కొందరు గొడవను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఏఎస్ఐ రాము ప్రవర్తన వల్ల కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖకు చెందిన వ్యక్తి, ఇలా మద్యం మత్తులో సామాన్యులపై దౌర్జన్యం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ డ్రెస్ ఉంటే ఏదైనా చేయవచ్చా? అనే ప్రశ్నలు వినిపించాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, రెండు వర్గాలను శాంతపరిచి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports