Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | ACTPnews

Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు



బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆయన విమర్శించారు. లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదని, కాళేశ్వరంపై చర్చ పెట్టిన ప్రభుత్వం విద్యుత్ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. “మీరు ఎన్ని విచారణలు చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ మోడీ జేబు సంస్థ అన్న రాహుల్ గాంధీ, ఇవాళ అదే సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *