Last Updated:
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా వణికిస్తున్నాయి. కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడగా.. 11 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు న్యూస్18 ఇంగ్లీష్ పేర్కొంది. మృతుల్లో మలప్పురంలో నలుగురు, కొట్టాయంలో ముగ్గురు, ఎర్నాకుళం, కొల్లం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఇడుక్కి, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. జలప్రళయం ధాటికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి.
వందలాది ఇళ్లు దెబ్బతినగా, 165 హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లింది. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 316 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్యాంపుల్లో ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Southern India Battles Widespread Flooding After Relentless Rains Leaves at Least 14 Dead, Thousands Displaced
Eleven people died and some 7,700 people have been evacuated in Kerala to around 275 relief camps, as per local authorities. (Reuters)Heavy rainfall also triggered a… pic.twitter.com/hypyQuLCb5
— RT_India (@RT_India_news) August 3, 2026
వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. పతనంతిట్ట, కొట్టాయం జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. అవసరమైతే అలప్పుజలో ఐటీబీపీ బలగాలను దించేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను కూడా రప్పించారు. మరోవైపు వయనాడ్, కన్నూర్ జిల్లాల్లోనూ భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. పతనంతిట్టలోని పంబా నది ఉప్పొంగడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ వరదల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 30 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 293 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 165 హెక్టార్ల వ్యవసాయ భూమి నీటమునిగి 3,596 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాబోయే రోజుల్లో నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రాణనష్టంపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆగస్టు 3, 6 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 3.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించిం
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














