Last Updated:
Madras Regiment Bolarum: కట్టుదిట్టమైన భద్రతకు, అత్యున్నత క్రమశిక్షణకు మారుపేరైన సైనిక కేంద్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
సికింద్రాబాద్లోని బొల్లారం పరిధిలో గల చారిత్రక మద్రాస్ రెజిమెంట్ సైనిక విభాగంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఉదంతం యావత్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రక్షణ కేంద్రం నడిబొడ్డున ఉన్న ఆయుధాగారం (కోట్) నుంచే ఏకంగా తుపాకులు, తూటాలు అపహరణకు గురికావడం రక్షణ వర్గాలను, పోలీసు యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటన వెనుక అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా లేక వ్యవస్థీకృత నేరగాళ్ల హస్తం ఉందా అనే దిశగా అధికారులు విచారణ ముమ్మరం చేశారు.














