తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు ఉప్పల్ భగాయత్లో వంజరి కమ్యూనిటీ ఆత్మగౌరవ భవనాన్ని (వంజరి భవన్) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ మరియు వంజరి కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వంజరి సంఘం అభివృద్ధికి మరియు భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. వంజరి భవనాన్ని కేవలం పెళ్లిళ్లకే కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కేంద్రంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
Source link
Minister Ponnam Prabhakar : వంజరి భవన్ ప్రారంభోత్సవం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










