NEET 2026 Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు.. పూణేలో ఎన్‌టీఏ ఎక్స్‌పర్ట్ అరెస్ట్.. అసలేం జరుగుతోంది ఈ విచారణలో? | | ACTPnews

News18


Last Updated:

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్-యూజీ 2026’ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కీలక అడుగు వేసింది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి శుక్రవారం మహారాష్ట్రలోని పూణేలో మరో ముఖ్య నిందితురాలిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

News18
News18

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్-యూజీ 2026’ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కీలక అడుగు వేసింది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి శుక్రవారం మహారాష్ట్రలోని పూణేలో మరో ముఖ్య నిందితురాలిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన మహిళను మనీషా సంజయ్ హవల్దార్‌గా గుర్తించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షా ప్రక్రియలో సబ్జెక్ట్ నిపుణురాలిగా (Subject Expert) పనిచేస్తున్న వ్యక్తులే ఈ లీకేజీ ముఠాతో చేతులు కలపడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది?

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షా ప్రక్రియ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ జరుగుతుంది. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, నిపుణులను ప్రశ్నపత్రాల తయారీ, సమీక్ష కోసం నియమించుకుంటుంది. పూణేలోని సేథ్ హీరాలాల్ సరఫ్ ప్రశాలలో పనిచేస్తున్న మనీషా సంజయ్ హవల్దార్‌ను ఎన్‌టీఏ ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) విభాగానికి సంబంధించిన నిపుణురాలిగా ఎంపిక చేసింది.

ఈ హోదాలోనే ఆమెకు నీట్-యూజీ 2026 ఫిజిక్స్ ప్రశ్నపత్రాలు ముందే అందుబాటులోకి వచ్చాయి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఆమె ఏప్రిల్ 2026లోనే ఈ అత్యంత రహస్య ప్రశ్నపత్రాలను, ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మరో నిందితుడికి చేరవేసినట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హవల్దార్ లీక్ చేసిన ప్రశ్నలను, ఆ తర్వాత మే నెలలో జరగాల్సిన అసలు నీట్ ఫైనల్ పేపర్ సెట్లలోని ప్రశ్నలతో దర్యాప్తు అధికారులు సరిపోల్చగా.. రెండు ఒకటేనని పక్కా ఆధారాలతో నిర్ధారణ అయింది.

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్‌డేట్స్ ఏంటి?

నిపుణుల నెట్‌వర్క్: ఈ లీకేజీ కేసులో ఎన్‌టీఏ నియమించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. మనీషా హవల్దార్ కంటే ముందే, మే 16న పూణేలోని మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన బయాలజీ (జీవశాస్త్రం) నిపుణురాలు మనీషా మంధారేను సీబీఐ అరెస్టు చేసింది. ఆమెకు వృక్షశాస్త్రం (బోటనీ), జంతుశాస్త్రం (జూలజీ) కంటెంట్‌ను నిర్వహించే బాధ్యత ఉండటంతో, ఆమె ద్వారానే మెజారిటీ పరీక్షా సామాగ్రి బయటకు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కుంభకోణం మూలాలను వెలికితీసేందుకు సీబీఐ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సమన్వయంతో సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 11 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై జరిపిన దాడుల్లో నేరారోపణకు సంబంధించిన పలు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, నిందితుల బ్యాంకు స్టేట్‌మెంట్లు మరియు మొబైల్ ఫోన్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. డిజిటల్, డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా ఈ లీక్ సమాచారం ఎవరెవరికి చేరిందనే నెట్‌వర్క్ ప్రవాహాన్ని (Data Flow) గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

పరీక్ష రద్దు.. జూన్ 21న రీ-ఎగ్జామ్

ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో, పరీక్షల పారదర్శకతపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమైన జాతీయ విద్యాశాఖ (NTA), మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షను మే 12న అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం చేసేందుకు గానూ.. వచ్చే జూన్ 21న ఈ పరీక్షను దేశవ్యాప్తంగా తిరిగి (Re-examination) నిర్వహించనున్నారు. లీకేజీ నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని సీబీఐ స్పష్టం చేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports