PM Modi Australia Visit July 2026: 3 దేశాల పర్యటనకు వెళ్లబోతున్న ప్రధాని మోదీ.. బలపడనున్న భారత్-ఆస్ట్రేలియా బంధం! | | ACTPnews

PM Modi Australia Visit July 2026: 3 దేశాల పర్యటనకు వెళ్లబోతున్న ప్రధాని మోదీ.. బలపడనున్న భారత్-ఆస్ట్రేలియా బంధం! |


ఈ సందర్భంగా ఆల్బనీస్.. “నా స్నేహితుడు ప్రధాని మోదీని ఆస్ట్రేలియాలో స్వాగతించడం నాకు గౌరవం. ఆస్ట్రేలియా-ఇండియా సంబంధం ఇదివరకటి కంటే ముఖ్యమైనది. ఇది ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని ప్రోత్సహిస్తుంది” అని అన్నారు. రెండు దేశాలూ కాంప్రెహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ (CSP) ద్వారా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇది వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, భద్రతా అంశాల్లో సహకారాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి: Telangana Scheme: కుట్టుమిషన్, ఎలక్ట్రిక్ బైక్, ఈ-స్కూటీ ఇస్తున్న ప్రభుత్వం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

మోదీ తన పర్యటనలో భాగంగా జులై 6-8న ఇండోనేషియాలో పర్యటిస్తారు. 8-10న ఆస్ట్రేలియాలో, 10-11న న్యూజిలాండ్‌లో పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ ప్రకారం, భారత్‌కి ఈ దేశాలు కీలకమైనవి. వీటితో భారత్ చిరకాలంగా సత్సంబంధాలను కలిగివుంది. భారత్‌కి ఆగ్నేయంగా ఉండే దేశాలు ఇవి. వీటితో సంబంధాన్ని ఇప్పుడు భారత్ మరింత పెంచుకోబోతోంది. ఇండోనేషియాలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం పలుకుతారు. ఆస్ట్రేలియాలో ఆల్బనీస్‌, న్యూజిలాండ్‌లో ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం పలుకుతారు. వీరితో భేటీలు జరుగుతాయి. ఇండియన్ డయాస్పోరాతో కూడా సమావేశాలు ఉంటాయి.

రెండు దేశాల మధ్య CSP 2020లో అప్‌గ్రేడ్ అయింది. ఆస్ట్రేలియా.. భారత్‌ను టాప్-టైర్ సెక్యూరిటీ పార్టనర్‌గా చూస్తుంది. రెండు దేశాలు క్వాడ్ (Quad) ద్వారా ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛా నావికాయానం, సప్లై చైన్‌ల స్థిరత్వం, మెరైన్ సెక్యూరిటీపై సహకరించుకుంటున్నాయి. డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్‌లో రక్షణ, సర్వీసులపై అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు పని ప్రారంభించారు. తద్వారా రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధం బలపడనుంది.

ఆర్థికంగా, 2025లో రెండు దేశాల మధ్యా ట్రేడ్ $50 బిలియన్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా భారత్‌కు కీలక ఎగుమతిదారు. ఎనర్జీ, మినరల్స్‌ని ఆ దేశం ఇండియాకి ఎగుమతి చేస్తోంది. భారత్‌లో ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్ బలంగా ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ పార్టనర్‌షిప్ వంటి కొత్త ఒప్పందాలు జరిగాయి. భారత్.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆస్ట్రేలియాకు అవకాశాలు ఇస్తుందని ఆల్బనీస్ ప్రశంసించారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి: Everest Green Boots Mystery: వీడిన ఎవరెస్ట్ గ్రీన్ బూట్స్ 30 ఏళ్ల మిస్టరీ.. బయటపడిన భారత జవాన్ ఐటెంటిటీ!

ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, విద్య, టూరిజం, క్రికెట్ వంటి సాంస్కృతిక సంబంధాలపై చర్చలు ఉంటాయి. భారతీయులు ఆస్ట్రేలియాలో 10 లక్షల మందికి పైగా ఉన్నారు. అంటే.. రెండు దేశాల మధ్యా “హ్యూమన్ బ్రిడ్జ్” లాంటిది ఉన్నట్లే. న్యూజిలాండ్ సందర్శన అనేది.. 40 ఏళ్ల తర్వాత మొదటి అధికారిక పర్యటన. ఇటీవల ఆ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. తద్వారా రెండు దేశాల మధ్యా ట్రేడ్ పెరుగుతోంది.

ఈ సందర్భంగా భారత్ ఇండో-పసిఫిక్‌లో తన స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్‌ను విస్తరిస్తోంది. రెండు దేశాలు సాధారణ విలువలైన ప్రజాస్వామ్యం, రూల్ ఆఫ్ లా, సార్వభౌమత్వం అంశాల్ని పంచుకుంటాయి. గ్లోబల్ ఛాలెంజెస్ మధ్య ఈ భాగస్వామ్యం మరింత ముఖ్యమవుతోంది. ఆల్బనీస్, మోదీ గతంలో G20 సమ్మిట్‌లో కలిసి ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports