Last Updated:
PM Modi: భారత యువత శక్తి, ఆకాంక్షలే దేశ అభివృద్ధికి బలమని ప్రధాని మోదీ అన్నారు. అబద్ధాల ప్రచారాల కంటే యువతలోని సత్యం, కష్టపడే తత్వమే గెలుస్తుందని పేర్కొన్నారు. వడోదరలో ‘నామో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో యువత, AI, ఉద్యోగాలు, మౌలిక వసతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత యువతలోని శక్తి, ఆకాంక్షలే దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాల కంటే యువతలోని సత్యం, కష్టపడే తత్వం, భవిష్యత్తుపై ఉన్న ఆశయాలే చివరకు విజయం సాధిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఛాత్రోన్ కి గూంజ్’ (విద్యార్థుల గళం) ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘జూఠ్ కి గూంజ్’ (అబద్ధాల హోరు)పై భారత యువత గళం పైచేయి సాధిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.














