PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews

News18


Last Updated:

PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

“వియత్నాంలోని ఫు క్వాక్ సమీపంలో భారతీయ పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన అత్యంత విషాదకరమైన వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. వియత్నాంలోని మన భారత రాయబార కార్యాలయం (ఎంబసీ), కాన్సులేట్ జనరల్ బాధితులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మన అధికారులు స్థానిక వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు,” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం మోదీ మూడు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లో ఇప్పటికే పర్యటనలను ముగించుకున్నారు. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నారు. న్యూజిలాండ్ పర్యటన అనంతరం మోదీ భారత్‌కు తిరిగి రానున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

One response to “PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి | | ACTPnews”

  1. Get4Games Avatar

    Bunu arıyordum 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed