బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తేజస్వి సూర్య దక్షిణాది రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణ రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన పోరాడుతామని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.












