intinti ramayanam Serial: ‘ఇంటింటి రామాయణం’ మే 30 ఎపిసోడ్లో, కమల్, శ్రీకర్ కొబ్బరి బొండంలో వోడ్కా కలుపుకోగా, అది తెలియక భానుమతి, పల్లవి తాగేసి ఇల్లంతా డాన్స్లతో రచ్చ రచ్చ చేస్తారు. మరోవైపు, శ్రియను ఆస్తి ఆశతో, రాజేశ్వరిని భరత్-పల్లవిల పుట్టుక రహస్యం బయటపెడతాననే భయంతో లొంగదీసుకుని ఇంటికి రప్పించానని అవని చెప్పడంతో అక్షయ్ షాక్ అవుతాడు. చివరగా, ఆరాధ్య బర్త్డే డ్రస్సును పాడుచేసింది పల్లవేనని కనిపెట్టిన అవని, ఆ నిజం బయటపెడితే కమల్ తరిమికొడతాడని ఆమెను బెదిరించి, ఆరాధ్య బర్త్డే వేడుకను గ్రాండ్గా మొదలుపెట్టడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.













