Last Updated:
తిరుమలకు ప్రైవేటు వాహనాలపై పరిమితి విధించారనే ప్రచారం అవాస్తవం అని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఆందోళన చెందవద్దని, టీటీడీ అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల మధ్య ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొండపైకి వచ్చే ప్రైవేటు వాహనాలకు పరిమితి విధించారని, రోజుకు 15 వేల వాహనాలను మాత్రమే అనుమతిస్తారని.. ఆ సంఖ్య దాటితే చెక్పాయింట్ల వద్దే వాహనాలను నిలిపివేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో తిరుమలకు కార్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లే భక్తుల్లో ఈ వార్తపై చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారంపై టీటీడీ తాజాగా స్పష్టత ఇచ్చింది.














