Last Updated:
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తిరుపతి జిల్లా పోలీసులు సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేశారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రతే ప్రధాన ప్రాధాన్యతగా సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో శ్రీవారిని దర్శించుకునేలా అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.













