Last Updated:
డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. ఒకేసారి ఏడు చోట్ల దాడులు.
పవిత్ర పుణ్యక్షేత్రంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ఉన్నతాధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉదయం పూటే మెరుపు దాడి చేశారు. శ్రీవారి ఆలయ టెంపుల్ డిప్యూటీ ఈఓగా ప్రస్తుతం పనిచేస్తున్న లోకనాథం నివాసంలో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేవుడి మాన్యాలకు, భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలకు నిలయమైన ప్రదేశంలో ఇలాంటి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు సామాన్య భక్తులను తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి.













